ఇటీవల సిరియాలో అమెరికా డెల్టా ఫోర్స్ దళాలు జరిపిన ఆపరేషన్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది అల్ బగ్దాదీ హతమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా బగ్దాదీ సోదరిని కూడా పట్టుకున్నారు. అజాజ్ నగంలో ఆమెను టర్కీ దళాలు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆమె భర్తను, బగ్దాదీ మేనకోడల్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. 65 ఏళ్ల రస్మియాను టర్కీ బోర్డర్ వద్ద పట్టుకున్నారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ తాజాగా ఆన్లైన్లో ఓ వార్నింగ్ పోస్టు పెట్టింది. తమ నేత చనిపోయినట్లు పేర్కొన్న ఆ సంస్థ.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకోనున్నట్లు చెప్పింది. భారతదేశాన్ని చూసి, పులినిచూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా, అమెరికా ఐఎస్ ను గెలుక్కుంది. ఈసారి భారీగానే నష్టపోయేట్టుగానే ఉంది. అసలే ఇటీవల తమ ఉనికిని చాటుకునేందుకు ఉగ్రవాదులు అనేక దాడులు చేస్తున్నారు. అమెరికా ఈ చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదేమో!