telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

విమానంలో టాయిలెట్ అనుకుని ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తీసిన మహిళ…!?

PLane

ఓ మహిళా ప్యాసెంజర్ విమానంలో ఉన్న వారందరి ప్రాణాలను ప్రమాదంలోకి తోసేసింది. టాయిలెట్ అనుకుని ఎమర్జెన్సీ డోర్ తీయడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కిపడ్డారు. శనివారం ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇస్లామాబాద్ వెళ్లే పీఐఏకి చెందిన పీకే-702 విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం రన్‌వేపైనే ఉండటంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. విమానం టేక్‌ఆఫ్ అయ్యే సమయంలోనే ఇలా జరగడంతో విమానంలో ప్రయాణిస్తున్న 37 మంది ప్యాసెంజర్లను వెంటనే కిందకు దించేశామని విమాన సిబ్బంది తెలిపారు. ఈ పని ఎందుకు చేశావని మహిళను అధికారులు ప్రశ్నించగా.. టాయిలెట్ అనుకుని తెరిచానని సమాధానమిచ్చింది. విమాన సిబ్బంది అవగాహన పొరపాటు కారణంగా విమాన ఎయిర్‌బ్యాగ్ ప్యారాచూట్‌ కూడా ఓపెన్ అయింది. మొత్తానికి ఈ విమానం తిరిగి బయలుదేరడానికి ఏడు గంటల సమయం పట్టింది.

Related posts