telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

భర్త పై సైనైడ్ తో దాడి చేయించిన భార్య.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు హోటల్ యజమాని హత్య కేసులో నిందితులు అరెస్టు అయ్యారు. నవంబర్ 4న బ్రహ్మయ్య ముఖం పై సైనైడ్ పోసి హత్య చేశారు దుండగులు. హత్య వివరాలు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు. బ్రహ్మయ్య భార్య సాయికుమారి ఈ హత్యకు సూత్రధారి అని పేర్కొన్నారు. హంతకులకు పది లక్షల సుపారీ ఇచ్చినట్లు మా విచారణలో తేలిందని ఆయన అనంరు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశామని అన్నారు. సాయికుమారి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేయించిందని ఆయన అన్నారు. బంగారు ఆభరణాల తయారీకి వాడే సెనైడ్ ఉపయోగించి బ్రహ్మయ్య ను చంపారని నిందితులు ముందుగానే రెక్కీ నిర్వహించారని అన్నారు. బ్రహ్మయ్య ముఖంపై స్ప్రే చల్లడం తో మొహం అంతా మంటతో రావడంతో, అతికష్టంగా ఇంటిని చేరుకున్నాడు.అయితే కొద్ది సేపటికి ముఖంపై కాలిన గాయాలు అయినట్లుగా కనిపించడంతో బ్రహ్మయ్య ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్రహ్మయ్య ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Related posts