బంధుమిత్రులతో ఆనందంతో జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సమయంలో సరదాగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపుతుండగా అదుపుతప్పి బులెట్ ఆయన భార్య శరీరంలోకి దూసుకుపోయింది. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే..మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన ఆప్ సింగ్ గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇటీవల తన భార్య పిల్లలతో కలిసి తన సోదరుడి వివాహానికి హాజరయ్యారు.
వివాహ ఆచారంలో భాగంగా గాలిలోకి తుపాకీతో కాల్పులు జరుపుతుంటారు. మాజీ ఆర్మీ మేయర్ కూడా తన తుపాకీతో గాలిలోకి కాల్పులు జరిపాడు. అనంతరం తుపాకీలో బుల్లెట్స్ అయిపోవడంతో.. వాటిని నింపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. అది కాస్త ఆయన భార్య రజినీ కి తగిలింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రాజధాని అమరావతిపై చర్చ జరుగుతోంది: మంత్రి బొత్స