telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ లో వింత శిశువు జననము… అచ్చం చేప ఆకృతిలో

హైదరాబాద్ లో వింత శిశువు జన్మించింది. నడుము నుంచిపై వరకు మనిషి ఆకారంలో, నడుము నుంచి కింద వరకు చేప ఆకృతిలో ఉంది పుట్టిన బిడ్డ. దీంతో ఆ బిడ్డను చూసి వైద్యులు షాక్ తిన్నారు. బిడ్డ పుట్టిన రెండు గంటల్లోనే మరణించినట్టు తెలిపారు వైద్యులు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ పాతబస్తీలోని ప్లేటు బురుజు ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చింది. నెలలు నిండక ముందే నొప్పులు రావడంతో బిడ్డను ప్రసవించింది. అయితే.. పుట్టిన బిడ్డను చూసి షాక్ తిన్నారు వైద్యులు. నడుము నుంచి పైవరకు మామలు మనిషిలా, కింది భాగం చేపను పోలి ఉన్నట్టు తెలిపారు వైద్యులు. జన్యులోపంతో పుట్టడంతో, రెండు గంటల్లోనే బిడ్డ మృతి చెందాడని వైద్యులు స్పష్టం చేశారు.

Related posts