కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ మహిళ సజీవదహనమైంది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చోటుచేసుకుంది. మనేక్కెల్లి నిర్నా క్రాస్రోడ్డు వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నాసిక్ నుంచి మచిలీపట్నానికి వెళ్తుండగా మార్గ మధ్యలో చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. అగ్నిప్రమాదం నుంచి భర్త, ఇద్దరు పిల్లలు బయటపడగా.. భార్య మృతి చెందింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతురాలిని మచిలీపట్నానికి చెందిన కల్యాణిగా పోలీసులు గుర్తించారు. వ్యాపార నిమిత్తం కల్యాణి కుటుంబం నాసిక్లో స్థిరపడింది.