telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బ్రేకప్ చెప్పినందుకు ప్రియుడి మర్మాంగాలపై…

Two sons murder after father sucide

అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో జరిగింది ఈ సంఘటన. 43 ఏళ్ల ఓ వ్యక్తి 30 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ జంట అన్యోనంగానే ఉంటున్నారు. అయితే జూన్ 24వ తేదీన బాలిస్టిక్ వెళ్లి మహిళ ఆ రోజు మొత్తం అక్కడే ఉండిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రియుడు తనను ఒక రోజు మొత్తం దూరం పెట్టిన ప్రియురాలికి బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి రాగానే మహిళకు తన నిర్ణయం చెప్పాడు. కానీ ఆమె బ్రేకప్‌కు ఒప్పుకోలేదు. విడిపోవడం తనకు ఇష్టం లేదని అతడ్ని సముదాయించేందుకు ప్రయత్నించింది. ప్రియుడు మాత్రం విడిపోవాల్సిందేనంటూ పట్టుబట్టాడు. దాంతో కోపోద్రిక్తురాలైన మహిళ అతడి మర్మాంగాలపై కత్తితో దాడికి పాల్పడింది. తీవ్రంగా గాయపరచడంతో స్పృహ తప్పిపడిపోయిన ప్రియుడ్ని చనిపోయాడనుకొని అక్కడి నుంచి పరారైంది. కొద్దిసేపటి తరువాత స్పృహలోకి వచ్చిన బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న బాధితుడిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడి ఫిర్యాదు మేరకు నిందితురాలైన ప్రేయసిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Related posts