విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్జీ (74) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల 30న ప్రేమ్జీ పదవీ విరమణ. ఈ క్రమంలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, వ్యవస్థాపక చైర్మన్గా ఆయన కొనసాగుతారని విప్రో పేర్కొంది. ప్రస్తుతం చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా, బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న ప్రేమ్జీ కుమారుడు రిషద్ ప్రేమ్జీ నూతన ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనునట్టు తెలిపింది.
previous post