telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఆత్మకూరు : … కేసుపెట్టి .. ఐదేళ్ల తరువాత సాక్ష్యాలు లేవన్న భార్య..

Court-Order

భర్తపై తప్పుడు కేసు పెట్టిన ఓ భార్యకు రూ.3 వేల జరిమానా విధిస్తూ ఆత్మకూరు జూనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పు చెప్పింది. తన భర్త శ్రీనివాసులు రెండో విహహం చేసుకుని, ఆమె ద్వారా పిల్లలు కన్నారంటూ ఆత్మకూరు పట్టణానికి చెందిన మంగళి గౌరిదేవి 2014లో కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేసింది. ఐదేళ్ల అనంతరం తన వద్ద సరైన ఆధారాలు లేవని చెప్పడంతో ఇన్‌చార్జ్‌ మెజిస్ట్రేట్‌ ఫకృద్దీన్‌ కేసును కొట్టివేశారు.

సాక్ష్యాధారాలు లేకుండా నిరాధారమైన కేసును కోర్టు ముందుకు తెచ్చి, కోర్టు సమయాన్ని, ప్రతివాదుల సమయాన్ని వృథా చేసినందుకు మంగళి గౌరిదేవి రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించలేకపోతే 15 రోజులు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు.

Related posts