పూరీ జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన టెంపర్ చిత్రం హిందీ, తమిళ భాషలలో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. హిందీలో ఇప్పటికే విడుదలైన రీమేక్ చిత్రం తమిళంలో “అయోగ్య” పేరుతో విడుదలకి సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఆయన సరసన రాశీ ఖన్నా కథానాయికగా నటిస్తుంది. అయోగ్య చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ చేసిందని వార్తలు వస్తున్నాయి. పార్థిపన్, కే.యస్.రవికుమార్లు ముఖ్యపాత్రలు పోషించారు. అయోగ్య థియేట్రికల్ రైట్స్ ను స్క్రీన్ సీన్ సంస్థ దక్కించుకుంది.
ఇప్పటికే మే 10న ఈ సినిమా విడుదలవుతుందని ప్రకటించి ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే సినిమా విడుదల వాయిదాకు కారణాలు మాత్రం తెలియలేదు. రాశీఖన్నా హీరోయిన్గా నటించారు. విశాల్ హీరో మాత్రమే కాదు, నడిగర్ సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా నిర్మాతల మండలిని ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకుని విశాల్ను పదవి నుండి తొలగించింది.