బాలీవుడ్లో కరోనా కలకలం రేపుతుంది. తాజాగా నటి రేఖ సెక్యూరిటీ గార్డ్కి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ముంబైలోని ఆమె బంగ్లాని బీఎంసీ సీల్ చేసింది. భవనం వెలుపలు కంటైన్మెంట్ జోన్గా నోటీసు కూడా అంటిచారు. కాగా నటి రేఖ సహా వారి ఫ్యామిలీ అందరికీ కరోనా పరీక్షలు చేసి శానిటైజ్ చేయడానికి వైద్యసిబ్బంది, అధికారులు రాగా ఆమె పరీక్షలకు నిరాకరించారని తెలుస్తుంది. రేఖతో సహా ఆమె కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని వైద్యులు కోరగా.. తాను కరోనా సోకిన వారితో కలిసింది లేదని, అందుకే టెస్లులు చేయించుకోను అని ఆమె చెప్పారట. దీంతో చేసేదేమి లేక కార్పొరేషన్ అధికారులు వెనుతిరిగారని తెలుస్తుంది. కరణ్ జోహార్, బోనీ కపూర్, అమీర్ ఖాన్ తదితర సెలబ్రిటీల సిబ్బంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
previous post
next post