telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఏ వేదికపై చూడాలనుకుంటున్నారు?

Silence

హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మ‌ల‌యాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలినీ పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో కూడా నటిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. ఓటీటీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ తమ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే తాజాగా నిర్మాత కోన వెంకట్ ఓ ట్వీట్ చేశారు. “మీరు థియేటర్ల కోసం జనవరి లేదా ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే… ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఏ వేదికపై చూడాలనుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. దీనిని బట్టి చిత్రబృందం ఓటీటీ విడుదలకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించినప్పటికీ ఈ ఏడాదిలో షూటింగ్‌లు ప్రారంభం కావడం కష్టమే. సినిమా థియేటర్లు అయితే ఈ ఏడాది తెరిచే పరిస్థితులు లేవు. వచ్చే ఏడాది సంక్రాంతికే థియేటర్లు తెరుచుకునే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీల బాటపడుతున్నాయి.

Related posts