చెపాక్ మైదానంలో భారత్-విండీస్ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ యువ బ్యాట్స్మెన్ హెట్మైర్ సెంచరీ(90 బంతుల్లో 106: 9 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విరుచుకుపడ్డాడు. అతనికి ఓపెనర్ షై హోప్(110 బంతుల్లో 60 పరుగులు) అర్ధసెంచరీ సాధించి చక్కటి సహకారాన్ని అందిస్తున్నాడు. హోప్ వికెట్ను కాపాడుకుంటూ నెమ్మదిగా లక్ష్యంవైపు దూసుకెళ్తుండగా.. హెట్మైర్ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. ప్రస్తుతం విండీస్ 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 191 పరుగులు చేసింది. విండీస్ విజయం సాధించాలంటే 88 బంతుల్లో 96 పరుగులు చేయాల్సి ఉంది. భారత కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా వికెట్ పడడం లేదు. విండీస్ బ్యాట్స్ మెన్ కు ఇండియా ఫీల్డింగ్ వైఫల్యం కూడా కలిసి వచ్చింది.
next post