ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంట్ కు పాశ్చాత్య దుస్తులతో వచ్చి, నెట్ ఇంట్లో చివాట్లు తిన్న పశ్చిమబెంగాల్ నటీమణులు గుర్తున్నారా.. ఆ వారే తృణమూల్ సభ్యులు నస్రత్ జహాన్ రూహి, మిమి చక్రవర్తి ఎంపీలుగా ప్రమాణం చేశారు.
ఈ రోజు సభ ప్రారంభం కాగానే వారిద్దరు బెంగాలీ భాషలో ప్రమాణం చేశారు. వందేమాతరం, జైహింద్ అంటూ దాన్ని ముగించారు. అనంతరం వారు స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా పాదాలకు నమస్కరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం పోడియం వద్దకు వెళ్లి స్పీకర్ను పలకరించడం సాంప్రదాయం.