telugu navyamedia
సినిమా వార్తలు

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కీర్తి సురేష్…!

Keerthy

కరోనా లాక్ డౌన్ కారణంగా కీర్తి సురేష్ సొంత ఊరికి వెళ్లిపోయింది ఇక ఈ సమయాన్ని తన కుటుంబంతో గడిపిన కీర్తి తిరిగి హైదరాబాద్ లో అడుగుపెట్టింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కీర్తి సురేష్ ల్యాండ్ అయ్యింది. సింపుల్ లుక్ లో కీర్తి కనిపించింది. మాస్క్ ధరించి.. చేతులకు గ్లౌజ్ లు పెట్టుకుని వైట్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ను ధరించి బ్లాక్ షూ వేసుకుని సింగిల్ గా నడుచుకుంటూ కీర్తి సురేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఇక కీర్తి సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. తాజాగా ‘గుడ్ లక్ సఖి’ అనే సినిమాలోనూ నటించింది కీర్తి సురేష్. ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల కానుంది అని సమాచారం. వీటితో పాటు నితిన్ రంగ్ దే , మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది. కాగా… కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమా థియేటర్లు మూసేయడంతో కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘పెంగ్విన్’ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. మరో సినిమా ‘మిస్ ఇండియా’ కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది కీర్తి. ఆ సినిమా తర్వాత అవకాశాలు ఈ భామను ఆఫర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి. వరుస అవకాశాలు అందుకుంటూ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా కొనసాగుతోంది.

Related posts