telugu navyamedia
క్రీడలు వార్తలు

ముంబైకి వసీం జాఫర్ పంచ్…!

నిన్న రాత్రి డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు పరాజయాల తర్వాత ఈ మ్యాచ్‌తో పంజాబ్‌ తిరిగి గెలుపు పట్టాలెక్కగా.. ముంబై వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. ముంబై లాంటి బలమైన జట్టుపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పంజాబ్‌ విజయం సాధించడంతో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. వసీం జాఫర్ పంజాబ్‌ కింగ్స్‌ జట్టు లోగో అయిన సింహం ఫోటోను పోస్ట్ చేసి దానిపై క్యాప్షన్‌ ”సింహం వేట మొదలుపెడితే.. పెద్దవాటినే వేటాడుతుంది” అంటూ రాసుకొచ్చాడు. పటిష్ట ముంబైపై పంజాబ్ గెలుపొందడంతో రోహిత్ సేనకు జాఫర్ ఇలా పంచ్ ఇచ్చాడు. సాధారణంగా జాఫర్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అయితే ముంబై ఇండియన్స్‌ను ఓడించిన తరువాత పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టిక‌లో ఐదో స్థానానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ఈ ముంబై సీజన్లో మూడవ ఓటమిని చవిచూసినప్పటికీ.. రన్‌రేట్ కారణంగా నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Related posts