ఓ రౌడీ షీటర్ తనను చంపుతానని బెదిరించాడని వరంగల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిశెట్టి మురళి హత్య కేసులో ప్రధాన నిందితుడు బొమ్మతి విక్రమ్ జిల్లా న్యాయస్థానం ఆవరణలో తనను బెదిరించాడని సుబేదారి పోలీసులకు పిర్యాదు చేశాడు. తనకు ప్రాణహాని ఉందని నాయిని రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు లో ఆందోళన వ్యక్తం చేశారు. నాయిని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విక్రమ్పై 290, 341, 506 సెక్షన్లలో కేసులు నమోదు చేశారు.