telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

ఈ కొత్త స్కీమ్ తో ఎస్‌బీఐ కస్టమర్లకు ప్రతినెలా ఆదాయం…!

sbi logo

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. నెట్ బ్యాంకింగ్, క్యాష్ విత్‌డ్రాయెల్, మనీ డిపాజిట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, చెక్ బుక్, లోన్స్ ఇలా పలు రకాల సర్వీసులు పొందొచ్చు. ఖాతాదారులకు ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌ను కూడా అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ద్వారా కస్టమర్లు ప్రతి నెలా కొంత మొత్తం పొందొచ్చు. దీని కోసం ముందుగా ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. డబ్బు డిపాజిట్ చేసిన అకౌంట్ హోల్డర్‌కు ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. డిపాజిట్ మొత్తంపై వచ్చే వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి అకౌంట్‌లో జమచేస్తారు. స్టేట్ బ్యాంక్ డిపాజిట్ చేసిన మొత్తంలో కొంతభాగాన్ని, డిపాజిట్ మొత్తంపై వచ్చే వడ్డీని కలిసి డిపాజిట్‌దారుడిని చెల్లిస్తుంది. డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ చెల్లింపు నెల రోజుల తర్వాతి నుంచి ప్రారంభమౌతుంది. అంటే మీరు నవంబర్ 8న డిపాజిట్ చేస్తే డిసెంబర్ 8న వడ్డీ లభిస్తుంది.

స్టేట్ బ్యాంక్ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో కనీసం రూ.25,000 డిపాజిట్ చేయాలి. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మాదిరి కాకుండా ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో ఎంత మొత్తాన్ని అయిన డిపాజిట్ చేయొచ్చు. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఒక వ్యక్తి గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయగలడు. 3, 5, 7, 10 ఏళ్ల కాలపరిమితితో ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ కింద డిపాజిటర్ నెలకు కనీసం రూ.1,000 పొందొచ్చు. ఎప్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై లభించే వడ్డీ రేటే ఈ స్కీమ్‌కు కూడా వర్తిస్తుంది. ఈ స్కీమ్‌పై లోన్ సదుపాయం కూడా ఉంది. డిపాజిటర్ మరణిస్తే యాన్యూటీ మొత్తంలో మిగిలిన డబ్బులు వెనక్కి ఇస్తారు.

Related posts