దిశా హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్, బాలీవుడ్ తారలు స్పందించారు. తాజాగా అలనాటి బాలీవుడ్ నటి వహీదా రెహమాన్ స్పందించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని అస్సలు క్షమించకూడదని అంటున్నారు. “నా అభిప్రాయం ప్రకారం ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడేవారిని అస్సలు క్షమించకూడదు. అదే విధంగా ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు కూడా మనకు లేదు. రేపిస్ట్లకు జీవిత ఖైదు శిక్షలు వేయాలి. ఇలాంటి కేసుల్లో లీగల్ ప్రాసెస్ ఫాలో అవ్వకూడదు. రేపిస్ట్లు రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు వారిపై కేసులు పెట్టడం ఎందుకు? అలా చేయడం వల్ల ప్రజల సొమ్ము వేస్ట్ అవతుంది. కాబట్టి ఎలాంటి లీగల్ ప్రాసెస్లను ఫాలో అవ్వకుండా రేపిస్ట్లకు జీవిత ఖైదు శిక్షలు వేస్తే మంచిది” అని తెలిపారు. వహీదా వ్యాఖ్యలు కాస్త ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అలా చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని వ్యతిరేకిస్తున్నారు.