నేడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. ట్రంప్ ఎదుర్కొంటున్న ఆరోపణలపై గురువారం మొదలైన జ్యుడీషియరీ విచారణ నిన్న తెల్లవారుజాము వరకు కొనసాగింది. నిజానికి ఇది పూర్తికాగానే ఓటింగ్ నిర్వహించాలని భావించారు. అయితే, సభ్యులకు విరామం అవసరమని భావించి ఓటింగ్ను నేటికి వాయిదా వేశారు.
అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ జోబిడెన్ను తప్పించేందుకు ట్రంప్ ఉక్రెయిన్పై ఒత్తిడి తీసుకొచ్చారని, ఆ దేశంలో బిడెన్ను ఉన్న వ్యాపారాలపై విచారణ జరిపించాలని ఒత్తిడి తీసుకొచ్చారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తు జరిపించకుంటే ఆ దేశానికి అందించాల్సిన 40 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని నిలివేస్తామని బెదిరించినట్టు ట్రంప్పై అభియోగాలు నమోదయ్యాయి.
రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన: చంద్రబాబు