రమా రీల్స్ బ్యానర్పై జిఎస్ కార్తీక్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా “ఓటర్”. ఈ చిత్రాన్ని జాన్సుధీర్ పూదోట నిర్మిస్తుండగా, సురభి హీరోయిన్గా నటిస్తుంది. ఎస్.ఎస్.తమన్ సంగీత సారథ్యం వహిస్తుండగా రాజేష్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంపత్రాజ్, నాజర్, పోసాని కృష్ణముళి, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. కానీ మొదటిరోజు కనీసం థియేటర్ లో పది మంది ప్రేక్షకులు కూడా లేక చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేశారు. సినిమా చూసిన ఒకరిద్దరు మాత్రం సోషల్ మీడియాలో తమ అభిప్రాయం వెల్లడించారు. అది కూడా అంత గొప్పగా ఏమీలేదు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి సంగతి తరువాత కనీసం పబ్లిసిటీ, పోస్టర్లకు అయిన ఖర్చు కూడా తిరిగొచ్చే అవకాశం కనిపించట్లేదు. సినిమాపై వివాదం నడుస్తుండడంతో ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించలేదు చిత్రబృందం. పైగా మంచు విష్ణు సినిమా విడుదలను ఆపడానికి ప్రయత్నించారు. అయినప్పటికి నిర్మాత తంటాలు పడి ఎలాగోలా సినిమాను విడుదల చేశారు. కానీ ఇంత కష్టపడి లాభం లేకుండా పోయింది.
previous post