telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఓటుకు నోటు కేసు : రేవంత్ రెడ్డి, సన్నిహితులకు నోటీసులు..!!

currency note for vote case progress

ఓటుకు నోటు కేసులో మరోసారి విచారణ ను ఎదుర్కొంటున్నారు నిందితులు. తాజాగా, కాంగ్రెస్‌ పార్టీ నేత రేవంత్‌రెడ్డికి, అత్యత సన్నిహితుడు నరేందర్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు కృష్ణకీర్తన్‌ రెడ్డిని కూడా ఈడీ అధికారులు ఓటుకు నోటు కేసులో నోటీసుల జారీచేసినట్లు సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు తీసుకొచ్చిన రూ.50 లక్షలతోపాటు, ఇవ్వజూపిన రూ.4.5 కోట్లకు సంబంధించి మూలాలపై ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 19వ తేదీలోగా ఈడీ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ ఆదేశించింది.

బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణకీర్తన్‌రెడ్డిని అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. ఈకేసులో మరో నిందితుడు ఉదయసింహకు కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.

Related posts