telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

పెందుర్తి ఆరు హత్యల కేసులో మరో ట్విస్ట్ !

crime

విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో చోటు చేసుకున్న ఆరు హత్యల అంశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో తానే నిందుతున్నని అప్పలరాజు ఒప్పుకున్నాడు. అయితే తాజాగా అప్పలరాజుతో పాటు మరో ఆరుగురు ఈ హత్యలో ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు విజయ్. వారిని కూడా అదుపులోకి తీసుకుంటేనే పోస్టుమార్టంకు ఒప్పుకుంటా అంటున్నాడు విజయ్. బత్తిన అప్పలరాజులతో పాటు దుర్గాప్రసాద్, గౌరీష్, శ్రీనులను కూడా శిక్షించాలంటూ డిమాండ్ విజయ్ డిమాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మార్చురీ వద్ద విజయ్, విజయ్ కుటుంబీకులు ఆందోళన చేస్తున్నారు. అయితే విజయ్ డిమాండ్ పై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts