విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ ఘటనపై సత్వరమే స్పందించినందుకు ప్రధానికి అభినందనలు తెలిపారు.
గ్యాస్ లీకేజీపై విచారణ కోసం సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని, విషవాయువు లీకేజీకి దారితీసిన అంశాలపై దర్యాప్తు జరిపించాలని ఆ లేఖలో కోరారు. పరిశ్రమ నుంచి లీకైన వాయువును స్టిరీన్గా కంపెనీ చెబుతోందని, కానీ దానితోపాటు మరిన్ని వాయువులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయనివివరించారు. కాబట్టి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఐదేళ్లుగా గుర్తుకురాని అవినీతి ఇప్పుడే గుర్తొచ్చిందా?