telugu navyamedia
క్రీడలు రాజకీయ వార్తలు సామాజిక

జర్మనీలో చిక్కుకున్న విశ్వనాథన్ ఆనంద్

Vishwanath Anand chess

జర్మనీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలను వారి ఇళ్లకే పరిమితం చేశారు. మరోవైపు కరోనా భయాలతో అక్కడి నుంచి విమాన సర్వీసులను భారత్ రద్దు చేసింది. దీంతో ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జర్మనీలో చిక్కుకుపోయారు.

జర్మనీలోని బుండెస్లిగాలో చెస్ టోర్నమెంటులో పాల్గొనేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. ఈ రోజు ఆయన తిరిగి రావాల్సి ఉంది. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఆనంద్ భార్య అరుణ మాట్లాడుతూ, ఆయన ఎప్పుడు వస్తారా? అని తాను కూడా ఎదురు చూస్తున్నానని తెలిపారు. 

Related posts