telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు

భక్తి పేరుతో మోసం.. విశ్వచైతన్యస్వామి అరెస్ట్

తెలంగాణలోని నల్గొండ జిల్లా పీఏ పల్లి(మ) అజ్మాపూర్‌లో విశ్వచైతన్య స్వామితో పాటు మరో ముగ్గురు శిష్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తి ముసుగులో మోసం చేశారని ఫిర్యాదులు అందడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. శ్రీసాయి సర్వస్వం మాన్సీ ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని.. భక్తి పేరుతో మహిళలను లోబర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ భక్తురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విశ్వచైతన్య స్వామి లీలలను బయట పెట్టారు. 26 లక్షల నగదు, 500 గ్రాముల బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 17 ఎకరాల భూమి పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విశ్వ చైతన్య స్వామికి 40 దేశాల్లో భక్తులున్నట్లు ఎస్పీ తెలిపారు.

Related posts