వెళ్లిపోమాకే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అలియాస్ విశ్వక్ సేన్ 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. తరువాత ఏడాది ఫలక్నామా దాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా గుర్తింపు పొంది విశ్వక్ వెంటనే పోలీస్గా థ్రీల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఔరా అనిపించాడు. హిట్ సినిమాతో అతడికి భారీ గుర్తింపు వచ్చింది. అయితే ఇటీవల విశ్వక్ తన నూతన సినిమాను తెరకెక్కించనున్నాడు. తమిళ్లో సూపర్ హిట్ అందుకున్న ‘ఓ మై కడవులే’ సినిమా తెలుగు రీమేక్లో చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాకు అశ్వత్ దర్శకత్వం చేయనున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్లను అందించాడు. ఈ చిత్రం రీమేక్కు కావలసిన రైట్స్ను పీవీపీ సినిమాస్ సొంతం చేసుకుంది. ఇప్పడు విశ్వక్ హీరోగా సినిమా చేసేందుకు రెడీగా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా అంచనాలను దాటుతుందా అనేది వేచి చూడాలి.
previous post
next post