telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

అక్కినేని, దాసరి, హరికృష్ణ విగ్రహాల తొలగింపు..విశాఖ బీచ్ రోడ్డులో ఉద్రిక్తత

dasari akkineni

విశాఖ బీచ్ రోడ్డులో అనుమతి లేకుండా ఏర్పాటైన విగ్రహాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. సోమవారం అర్థరాత్రి సినీ ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణల విగ్రహాలను తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీవీఎంసీ జోన్ 2 ఏసీపీ నాయుడు ఆధ్వర్యంలో విగ్రహాలను తొలగించారు. బీచ్‌రోడ్డులో విగ్రహాల ఏర్పాటుపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.ఈ ముగ్గురి విగ్రహాల ఏర్పాటుకు జరుగుతున్న పనులను గమనించిన స్థానికులు కొందరు కోర్టును ఆశ్రయించగా, వాటిని వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశించింది.

దీంతో స్పందించిన పోలీసులను, కార్పొరేషన్ అధికారులు గత రాత్రి వీటిని తొలగించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న సినీ ప్రముఖుల అభిమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనుమతి లేని విగ్రహాలను తొలగించే విషయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గేది లేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. గతంలో ఈ విగ్రహాలను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ ఏర్పాటు చేయగా.. వాటిని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

Related posts