telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

మావోయిస్టు అగ్రనేతలు ఎవరూ పట్టుబడలేదు: ఎస్పీ

another huge encounter in chhattisgarh

ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. అయితే, కూంబింగ్ సందర్భంగా మావోయిస్టు అగ్రనేతలు పట్టుబడ్డారంటూ కథనాలు వస్తున్నాయి. దీనిపై విశాఖ జిల్లా ఎస్పీ బాబూజీ వివరణ ఇచ్చారు. కూంబింగ్ లో మావోయిస్టు అగ్రనేతలు పట్టుబడ్డారని వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతోందని చెప్పారు.

ఈ నెల 22, 23వ తేదీల్లో జరిగిన ఎన్ కౌంటర్లలో ఐదుగురు మావోలు మృతి చెందారని, మృతులందరూ చత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందినవారని ఎస్పీ వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన మావోయిస్టు భవానీ తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో పోలీసులకు చిక్కిందని ఎస్పీ తెలిపారు. ఘటన స్థలంలో ఓ ఏకే-47, ఇతర ఆయుధాలు దొరికాయని వివరించారు.

Related posts