తెలుగుదేశం పార్టీ కి చెందిన విశాఖపట్నం కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు షాకిచ్చారు. కార్యాలయంలో విద్యుత్ బిల్లు బకాయిలు భారీగా పేరుకున్న నేపథ్యంలో కరెంట్ ను కట్ చేశారు. కార్యాలయానికి వచ్చిన అధికారులు, ఫ్యూజ్ లు తొలగించి, వాటిని తీసుకుని వెళ్లిపోయారు. బకాయి పడ్డ రూ. 4.8 లక్షలను వెంటనే చెల్లిస్తేనే తిరిగి కరెంట్ సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
పార్టీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మరణించకముందు కార్యాలయ వ్యవహారాలన్నీ ఆయనే నిర్వహించేవారు. అప్పట్లో నెలకు దాదాపు రూ. 80 వేల వరకూ కరెంట్ బిల్ వస్తుండేది. ఆ డబ్బును ఆయనే చెల్లించారు. మూర్తి మరణించిన తరువాత ఎవరూ కరెంట్ బిల్ కట్టేందుకు ఆసక్తిని చూపకపోవడంతోనే బిల్లు బకాయి పెరిగిపోయిందని తెలుస్తోంది.
ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్న కేసీఆర్: భట్టి విక్రమార్క