telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇషాన్‌ ను కొన్ని సలహాలు ఇచ్చిన వీరు…

రెండో మ్యాచ్ లో రాణించిన ఇషాన్‌ కిషన్‌ను కొనియాడిన ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. అతనికి కొన్ని విలువైన సూచనలు ఇచ్చాడు. ‘తనదైన రోజు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తప్పకుండా జట్టును గెలిపిస్తాడు. ఫార్మాట్‌ ఏదైనా చివరి వరకూ క్రీజులో ఉండి విజయాన్నందిస్తాడు. అతని బ్యాటింగ్‌లో అదో ప్రత్యేకత. ఈ విషయంలో పంత్‌, కిషన్‌.. కోహ్లీని చూసి నేర్చుకోవాలి. మీదైన రోజు ఔటవ్వకుండా ఆడాలి. చివరివరకూ క్రీజులో ఉండి జట్టును గెలిపించాలి. నాక్కూడా సచిన్‌ ఇదే విషయం చెప్పేవాడు.’అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ‘ఈ రోజు నువ్వు బాగా ఆడుతున్నావని తెలిస్తే.. వీలైనంతసేపు క్రీజులో పాతుకుపో. చివరి వరకు పరుగులు చేస్తూ నాటౌట్‌గా మిగిలిపో. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. దాంతో ఆ రోజు ఔటవ్వకుండా ఆడి పరుగులు సాధించాలి” అని సచిన్‌ నాతో అనేవాడు” అని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ గుర్తు చేసుకున్నాడు. ఇక ఇషాన్‌ ఇంకా ఐపీఎల్‌ భ్రమలోనే ఉన్నాడని.. అందుకే తన విధ్వంసాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడని సెహ్వాగ్ తెలిపాడు.

Related posts