టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి సెషన్ పూర్తయింది. 26 ఓవర్ల పాటు సాగిన ఈ సెషన్లో భారత్ 2 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది..
దీంతో విరాట్ కోహ్లీ తన 100వ టెస్టులో మరో మైలు రాయిని చేరుకున్నాడు. తన ఇన్నింగ్స్లో 38 పరుగులు చేసిన వెంటనే 8000 పరుగులు పూర్తి చేశాడు. టెస్ట్ క్రికెట్లో 8000 పరుగులు పూర్తి చేసిన 6వ భారతీయుడుగా నిలిచాడు. టీమిండియా నుంచి ఈ లిస్టులో సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్, గవాస్కర్, లక్ష్మణ్ ఉన్నారు.
మరోవైపు శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో తెలుగబ్బాయి హనుమ విహారి అర్థసెంచరీతో దూసుకెళ్తున్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరుస్తూ తన హాఫ్ సెంచరీని నమోదు చేసాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి.
Fastest Indian players to 8000 Test runs – by innings:
154 – Sachin Tendulkar
158 – Rahul Dravid
160 – Virender Sehwag
166 – Sunil Gavaskar
169 – Virat Kohli*#INDvSL— Umang Pabari (@UPStatsman) March 4, 2022
బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్ పనితీరు సరిగా లేదు: వెంగ్ సర్కార్