కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే విషయం తెలిసిందే. కానీ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20లో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసి మంచి స్కోర్ సాధించాడు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ భవిష్యత్లో, ఐపీఎల్లో ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే మైక్ హసన్ తాజాగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఐపీఎల్లో దేవ్దత్తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడం కోసం నిజంగా ఎంతగానో ఎదురుచూస్తున్నా. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇద్దరూ భిన్నమైన ఆటగాళ్లు. పవర్ప్లే తర్వాత కోహ్లీ ఎలా ఆడతాడో మనందరికీ తెలిసిందే. అతడో అసాధారణమైన ఆటగాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఓపెనింగ్ చేస్తే అది మరోస్థాయిలో ఉంటుంది. ఇది మా ప్రణాళికలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కోహ్లీ ఐపీఎల్లో ఓపెనింగ్ చేయాలని మేం వేలానికి ముందే నిర్ణయించుకున్నాం. అందుకు అనుగుణంగానే మా వేలం ప్రణాళికలు రూపొందించుకున్నాం. అతను టీమిండియాలో ఓపెనింగ్ చేయడం సంతోషంగా ఉంది. దాంతో ఆ స్థానంలో అతనేం చేయగలడో చూపించాడు’ అని హెసన్ పేర్కొన్నాడు. అయితే ఇంగ్లండ్తో చివరి టీ20 విజయానంతరం.. భవిష్యత్తులో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేస్తానని, ఐపీఎల్లోను ఇన్నింగ్స్ ప్రారంభిస్తామని విరాట్ కోహ్లీ తెలిపిన విషయం తెలిసిందే.
previous post
next post
పార్టీలో చేరిన తనకు పవన్ ఓ నాయకుడు: నాగబాబు