telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆసీస్ కు బయల్దేరిన టీం ఇండియా…

ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఆసీస్ కు ప్రయాణమైంది. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో వివిధ రకాల జట్లకు ఆడిన భారత ఆటగాళ్లు మళ్ళీ ఒక్క జట్టుగా ఏర్పడి ఆసీస్ టూర్ కు బయల్దేరారు. దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అందులో ఆటగాళ్లు అందరూ కొత్త రకం పిపిఈ కిట్లను ధరించి ఉన్నారు. అయితే ఈ నెల 27 నుండి ప్రారంభం కానున్న ఈ టూర్ లో భారత జట్టు మొత్తం మూడు టీ 20, మూడు వన్డే, నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అందులో డిసెంబర్ 17-21 వరకు జరిగే మొదటి టెస్టులో మాత్రమే భారత కెప్టెన్ విరాట్ ఆడనున్నాడు. ఎందుకంటే… ప్రస్తుతం కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రెగ్నెంట్. వారు జనవరిలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో కోహ్లీ తిరిగి భారత్ కు వచ్చేస్తాడు. ఇక ఇందులో కేవలం టెస్ట్ జట్టు మాత్రమే ఎంపికైన ఆటగాళ్లు అక్కడే ఉండి ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. మొదటి టెస్ట్ మ్యాచ్ అయిన పింక్ బాల్ టెస్ట్ లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది భారత జట్టు. అందుకోసం అక్కడే శాండిల్ లైట్స్ కింద ప్రాక్టీస్ చేయనున్నారు.

Related posts