telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

జైలులో క్షీణించిన వరవరరావు ఆరోగ్యం.. ఎట్టకేలకు ఆసుపత్రికి తరలింపు

varavara Rao

విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావును ఎట్టకేలకు ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యం నుంచి వరవరరావు పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలన్న ప్రొపెసర్ హరగోపాల్ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం గత రాత్రి నవీముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించింది.

తీవ్ర అస్వస్థతకు గురైన వరవరరావు గతంలో ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే, ఆయన పూర్తిగా కోలుకోకుండానే గత నెల 1న డిశ్చార్జ్ చేశారు. జైలులో ఉన్న ఆయన ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలంటూ హరగోపాల్ సహా తెలంగాణ ఫోరం అభ్యర్థనతో వరవరరావును ఆసుపత్రికి తరలించారు.

Related posts