బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ”. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ని కేటీఆర్, చిరంజీవి కలసి విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 77 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం.
నైజాం – రూ. 20 కోట్లు
సీడెడ్ – రూ. 15 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.70 కోట్లు
కృష్ణా – రూ. 6.40 కోట్లు
గుంటూరు – రూ.7.80 కోట్లు
ఈస్ట్ గోదావరి జిల్లా – రూ.7.20 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లా – రూ. 5.60 కోట్లు
నెల్లూరు – రూ.3.30 కోట్లు
మొత్తం ఆంధ్రా/తమిళనాడు – రూ. 77 కోట్లు
ఇండియాలో మిగతా ప్రాంతాలు – రూ. 8.50 కోట్లు
ఓవర్ సీస్ – రూ.9 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ – రూ. 94.50 కోట్లు
జనవరి 11న సంక్రాంతి కానుకగా “వినయ విధేయ రామ” చిత్రం పేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా చిత్రీకరణ పూర్తయితే రాజమౌళి భారీ మల్టీస్టారర్ కోసం మేకోవర్ అవుతారు రామ్ చరణ్. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను మొదలుపెట్టారు.