telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఏపీ సచివాలయ ఉద్యోగాలు : ..నియామకాలకు …సోమవారం నోటిఫికేషన్..

village Secretariat recruitment through dsc

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వార్డు సచివాలయాల నియామకానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ నెల 22న వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 వరకు రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు జరపనున్నారు. అక్టోబరు 2 నుంచి వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలన్నది ప్రభుత్వ యోచన. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు.

పట్టణాల్లో వార్డు సచివాలయాల ఏర్పాటుకు విధివిధానాలు రూపొందించారు. రాష్ట్రం లో 3775 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రతి 4 వేల మంది జనాభాకు ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయం ద్వారా లబ్దిదారులందరికీ నేరుగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వార్డు సచివాలయాలను వార్డు కార్యాలయాల్లోనూ, అంగన్ వాడీ భవనాల్లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

Related posts