విలక్షణ నటుడిగా విక్రమ్ మరో ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడట. ప్రతి సినిమాను తొలి సినిమాగా ఫీలై ప్రాణం పెట్టి చేస్తాడు. అయితే ఈ మధ్య విక్రమ్ని సరైన సక్సెస్లు పలకరించడం లేదు. రీసెంట్గా మిస్టర్ కెకె అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కోట్టింది. త్వరలో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తన 58వ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. 7స్క్రీన్ స్టూడియోస్, వయకామ్ 18 స్టూడియోస్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో సెట్స్పైకి వెళ్లనుంది. ఏప్రిల్ 2020లో విడుదల చేయాలని చూస్తున్నారు.
ఈ చిత్రంలో విక్రమ్ దాదాపు 25 గెటప్స్ పోషించనున్నాడట. కమల్ హాసన్ తర్వాత మళ్లీ అన్నీ పాత్రలని విక్రమ్ పోషించనున్నాడు. ఇప్పటికే అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఆయన మేకప్, గెటప్లకు డిజైన్లు రెడీ చేస్తోందని సమాచారం. ఇది పాన్ ఇండియా సినిమా. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తాం. వయకామ్ 18 మోషన్ పిక్చర్స్తో కలిసి భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ టెక్నీషియన్లు ఇందుకోసం పనిచేయనున్నారు’ అని 7స్క్రీన్ స్టూడియోస్ ఇటీవల తెలిపింది. గతంలో ఎన్నడు పోషించని పాత్రలలో విక్రమ్ కనిపిస్తుండగా, ఆది ఆయనకి ఛాలెంజింగ్గానే ఉంటుందని అంటున్నారు.