“అర్జున్ రెడ్డి” చిత్రం తమిళంలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. విక్రమ్ తనయుడు ధృవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో తమిళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. “ఆదిత్యవర్మ” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ఈ చిత్రాన్ని నవంబర్ 8న విడుదల చేయనున్నారు. ఒరిజినల్ వర్షెన్కి సంగీతం అందించిన రధన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్గా రవి కె చంద్రన్ పని చేస్తున్నారు. ధృవ్ విక్రమ్ సరసన అక్టోబర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ4 ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్గా నటిస్తుంది. నిన్న చెన్నైలో చిత్ర ఆడియో వేడుక జరుగగా, రధన్ సమకూర్చిన బాణీలు విడుదల చేశారు. ఇవి సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తున్నాయి. ఇక కొద్ది సేపటి క్రితం ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా రవి కె చంద్రన్ పని చేశారు. ధృవ్ విక్రమ్ సరసన అక్టోబర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటించింది. ఈ4 ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్గా నటించింది.
కాగా కోలీవుడ్ ప్రేక్షకులలో జోష్ నింపేందుకు ఈ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత ముఖేష్ మెహతా సిద్దమయ్యారు. నిన్న చెన్నైలో జరిగిన ఆదిత్మ వర్మ ఆడియో వేడుకలో 2021-22 సంవత్సరాలలో విక్రమ్,ధృవ్ హీరోలుగా ఓ భారీ చిత్రం చేయబోతున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరచాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రంగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం తన 58వ చిత్రంతో బిజీగా ఉన్న విక్రమ్ ఇందులో 25 గెటప్స్ లో కనిపిస్తారని టాక్.