telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

వికాస్ దూబే ఎన్ కౌంటర్ స్థలంలో ఏం జరిగింది?

vikas dubay

ఉజ్జయిని నుంచి  గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను తీసుకుని నిన్న సాయంత్రం యూపీలోని కాన్పూర్ కు పోలీసులు బయలుదేరారు.దాదాపు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వుండగా, 690 కిలోమీటర్ల దూరం సజావుగానే సాగింది. ఆపై కాన్పూర్ శివార్లలోకి వాహనం ప్రవేశించగానే అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. అవే గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్ కౌంటర్ కు కారణమైనట్టు తెలుస్తోంది. ఘటనా స్థలిలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఓ పోలీసు అధికారి స్వయంగా వెల్లడించారు.

వికాస్ దూబేను కాన్పూర్ కు తీసుకుని వస్తున్నారని అతని అనుచరులకు తెలిసిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేసిన సదరు అధికారి, కాన్పూర్ కు 40 కిలోమీటర్ల దూరంలోకి తమ కాన్వాయ్ రాగానే, కొన్ని అనుమానాస్పద వాహనాలు వెంబడించాయని అన్నారు. అపై కాన్పూర్ శివార్లలోకి వాహనం రాగానే, డ్రైవర్ వెనుక ఉన్న వికాస్ దూబే, తన పక్కనే ఉన్న కానిస్టేబుల్ నుంచి పిస్టల్ ను లాక్కున్నాడు. డ్రైవర్ ను తోసేసే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ఆ వెంటనే వాహనాన్ని దిగిన దూబే, పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని లొంగిపోవాలని హెచ్చరించినా వినలేదు. దీంతో ఆత్మరక్షణార్థం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దూబేను ఆసుపత్రికి తరలించేలోపే అతను మరణించాడు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన కాన్పూర్ ఐజీ మోహిత్ అగర్వాల్, జరిగిన ఘటనలో వికాస్ దూబే హతుడయ్యాడని వెల్లడించారు.

Related posts