telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భ్రమల్లోంచి బాబు బయటకు రాడు…భ్రష్టుపట్టించే వరకు వదలడు..

vijayasaireddy ycp

తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి సెటైర్లు వేశారు. “తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందనే సామెత చంద్రబాబుకి చక్కగా సరిపోతుంది. గెలుపోటములు నిర్ణయించేది ప్రజలు. వారి విశ్వాసాన్ని కోల్పేతే ఏ వ్యవస్థా తనను దొడ్డిదారిన అధికార పీఠంపై కూర్చోబెట్టలేదు. అయినా ఆయన భ్రమల్లోంచి బయటకు రాడు. అందరినీ భ్రష్టుపట్టించే వరకు వదలడు.” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసాడు.
“అధిరారంతో విర్రవీగిన రోజుల్లో ‘అంతు చూస్తా, తోక కోస్తా’ అని బీసీలను బాబు ఈసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు బాబు గారూ. విస్తరిలో వడ్డించేప్పుడే ఆకలి మంటను గుర్తించాలి. వాటిని ఎత్తేసేటప్పుడు కాదు.” మరో సెటైర్ వేసాడు విజయసాయిరెడ్డి. అంతకుముందు ట్వీట్ లో సీఎం జగన్ ను పొగుడుతూ చేసాడు. “కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో వచ్చే డబ్బుని తమ ప్రభుత్వం ముట్టుకోదని సీఎం జగన్ గారు ప్రకటించారు. ప్రతి పైసా అక్కడి ప్రజలకే చెందాలని నిర్ణయించారు.సంస్థల సొమ్ముని సొంత ప్రయోజనాలకు దారి మళ్లించిన బాబుకి, సంస్థలని స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయిస్తున్న జగన్ గారికి ఎంత తేడా?” అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

Related posts