తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్ విజయశాంతి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన మంత్రి వర్గంలో ఐదేళ్లపాటు మహిళలు లేకుండా చేశారని అన్నారు. మరో ఐదేళ్లు ఇలాగే ఉండాలన్న ప్లాన్తో ఉన్నారని మండిపడ్డారు. కేసీఆర్కు మాత్రం ఈ విషయంపై పెద్దగా పట్టింపులు లేవన్నారు. మహిళలపై ఆయనకున్న ఉదాసీనతకు నిదర్శనమని విజయశాంతి విమర్శించారు.
గత ఐదేళ్ల కాలంలో మహిళా మంత్రులకు స్థానమివ్వకుండా కేబినెట్లో కొనసాగించిన పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కేటాయించడం పై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జారుగుతోందన్నారు. కనీసం దీనిని చూసిన తర్వాత అయినా కేసీఆర్ గారు మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా? అని ఆమె ప్రశ్నించారు.