పార్టీల ఫిరాయింపుల పై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి స్పందించారు. రాజకీయ నాయకులు పార్టీలను మారుతున్న సమస్యలకు కొన్ని పార్టీల వైఖరే కారణమని విజయశాంతి ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. సిద్ధాంత విధానాల కోసం ఉన్న కార్యకర్తలకు బదులు,వ్యాపార నిర్బంధాలు ఉన్న పెద్దలకు కీలక పదవుల్లో స్థానం కల్పించడం వల్ల ఇది ఉత్పన్నమవుతూ వచ్చింది.టీడీపీ, టీఆర్ఎస్ లు ఈ సంస్కృతిని పోషిస్తు వచ్చాయి.
ఏపీ టీడీపీలోని పరిణామాలు, తెలంగాణలోని టీఆర్ఎస్ కు భవిష్యత్ లో తప్పవని ప్రజాస్వామ్య వాదులు అభిప్రాయపడుతున్నారు. రెండు ప్రాంతీయ పార్టీలు సమర్తవంతమైతే జాతీయ పార్టీలకు స్థానం దొరకక పోవచ్చనేది కూడా వాస్తవం అని వ్యాఖ్యానించారు. కానీ రెండు జాతీయ పార్టీలు బలోపేతమై పోరాడితే ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్టాలలో స్థాయి తగ్గిపోవడం కూడా అంతే వాస్తవం అన్నారు.
ఈవోని మంత్రి వెనకేసుకొస్తున్నారు: దేవినేని ఉమ