telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌వి పిచ్చి సర్వేలంటూ మండిపడ్డ రాములమ్మ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ నాయకులు విజయశాంతి. కేసీఆర్‌వి అన్ని పిచ్చి సర్వేలని.. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అవి రుజువు అయ్యాయని ఆమె ఫైర్‌ అయ్యారు. “నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తామే గెలుస్తామని సీఎం గారు పర్సెంటేజి లెక్కలతో చెప్పుకోవటం హాస్యాస్పదం. అసలు టీఆరెస్ నిలబెట్టే అభ్యర్థి కబ్జాకోరో… దోపిడీదారో తెలిసినంక ప్రజలు ఏ స్థానం ఇయ్యాలో నిర్ణయిస్తారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి గారి ఊహాగానాలు కూడా… కేసీఆర్ గారివి అన్నీ అవకతవక పిచ్చి సర్వేలని నేను గతంలోనే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చెప్పినది కూడా అదే తీరున జరిగింది. అంతేకాకుండా బండి సంజయ్ గారికి లోకసభ స్పీకర్ అనుమతి లభించినట్లయితే… ఈ అసత్యాల ముఖ్యమంత్రి గారి అనేక మోసాలలో మరొక్కటి బయటపడి, ప్రజలకు మరింత స్పష్టత ఏర్పడుతుంది. ” అంటూ విజయశాంతి మండపడ్డారు.

Related posts