telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌పై సామెత వదిలిన విజయశాంతి !

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి విమర్శలు చేసింది రాములమ్మ. ఈ సారి గోమాతకు కేసీఆర్‌ ప్రభుత్వంలో భద్రత లేదని మండిపడింది. “హిందువుల ఓట్లు గుర్తుకొచ్చినప్పుడల్లా యజ్ఞాలు, పూజలు, స్వాములతో మంతనాలలో మునిగి తేలే కేసీఆర్ గారికి గోమాత మాత్రం దైవంగా కనిపించదు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్న లక్ష్యంతో నిన్న ఆదివారం హైదరాబాదులోని చార్మినార్ భాగ్యలక్ష్మి మందిరం నుంచి బహదూర్‌పురా మల్లన్న ఆలయం వరకు గో మహాయాత్ర నిర్వహించేందుకు ముందుకు వచ్చిన పలు గో సంరక్షణ సంస్థలకు అనుమతి కూడా ఇవ్వలేదు. ఇప్పటికే దేశంలోనే గో హత్యలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందుంది. తెలంగాణలో అక్రమంగా వున్న కబేళాలను మూసివేయించాలని ఎన్ని విజ్ఞప్తులు పెట్టుకున్నా తెలంగాణ సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. స్వయంగా హిందువు అయి ఉండి… హిందుగాళ్ళు బొందుగాళ్ళు అంటూ చిల్లర వ్యాఖ్యలు చేసే కేసీఆర్ నుంచి గోమాత రక్షణను ఆశించడం… ఇసుక నుంచి తైలం పిండే ప్రయత్నం ఒకటే. ” అంటూ విజయశాంతి మండిపడ్డారు.

Related posts