telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్ఎస్‌ పార్టీలో గూండాలు ఉన్నారు : విజయశాంతి

విజయశాంతి ఏ మధ్యే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక నేడు హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బీజేపీని చించేయమని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.. అడ్రస్ లేని పార్టీ అంటూ ఓ నేత అంటున్నాడు.. టీఆర్ఎస్‌ పార్టీలో గూండాలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నేతవరకు భూతులే మాట్లాడుతున్నారన్న ఆమె.. తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండాలని కలలు కన్నాను.. కానీ, టీఆర్ఎస్ పాలనలో విచ్చల విడిగా దోపిడీ.. కబ్జాలతో తెలంగాణ నాశనం అవుతుందన్నారు. యువతకు ఉద్యోగాలు వస్తాయి.. రైతులు బాగుపడతారని భావించా.. కానీ, నా తెలంగాణ అన్యాయం అవుతుంది.. అభివృద్ధి తెలంగాణ కావాలంటే బీజేపీతోనే సాధ్యం అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కమిట్‌మెంట్‌, క్రమశిక్షణ ఉన్న పార్టీ బీజేపీ.. ఈ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అన్నారు విజయశాంతి.. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ రూపురేఖలు మారుతాయని ప్రకటించిన రాములమ్మ.. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. ఏదైనా ఘటన జరిగిన రోజు గొప్పగా మాట్లాడి.. తప్పు చేసినవారిని ఎన్‌కౌంటర్ చేయడం పరిష్కారం కాదన్న ఆమె… చట్టాలు పగడ్బందీగా అమలు చేయాలి.. అలా చేయనంత వరకు మార్పురాదన్నారు. మండలాలు, జిల్లా లు, గ్రామాలకు వెళ్లి ప్రజలకు బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పాలని కార్యకర్తలకు సూచించారు విజయశాంతి.. తెలంగాణ ప్రజలు అమాయకులు.. వారిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత మనపై ఉందన్న ఆమె.. దుబ్బాకలో జీహెచ్ఎంసీలో మహిళలు పెద్ద పాత్ర పోషించారంటూ ప్రశంసించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ లేదా ప్రగతిభవన్‌లో కూర్చొని పాలిస్తున్నాడు.. ఆయన రాజకీయాల నుంచి రిటైర్డ్ అయిపోయారని ఎద్దేవా చేసిన రాములమ్మ.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు బయటకు రావాలి కదా? వ్యాక్సిన్ వచ్చినప్పుడు బయటకు వచ్చి ధైర్యం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఆ పని చేయలేదని మండిపడ్డారు.

Related posts