అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. 90లలో లేడీ సూపర్స్టార్గా అద్భుతమైన స్టార్డమ్ సంపాదించిన విజయశాంతి మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమాపై ఆమె అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా దీపావళి సందర్భంగా “సరిలేరు నీకెవ్వరు” మూవీ నుండి విజయ శాంతి లుక్ విడుదల చేసారు. భారతి పాత్రలో అలరించనుంది. ఇందులో విజయ శాంతి లుక్ అభిమానులలో ఆసక్తి కలిగిస్తుంది. ఈ లుక్ చాలా బావుందంటూ ఆడియెన్స్ నుండి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో విజయశాంతి తన ఫేస్బుక్ ద్వారా స్పందించారు. “ఓ నటిగా ఇంత అభిమానాన్ని పొందడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా కమ్ బ్యాక్కి ఇంత రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా అనిపించింది. ప్రిన్స్ మహేశ్బాబు, అనిల్ రావిపూడి బెస్ట్ కాంబినేషన్లో `సరిలేరు నీకెవ్వరు` సినిమా చేయడం మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది. ఈ జర్నీ నాకు అసాధారణమైన అనుభూతినిచ్చింది” అన్నారు విజయశాంతి.
previous post