టీఆర్ఎస్ పార్టీపై మరోసారి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. “నిజాం నవాబులు తమ విధేయులైన దొరల దన్ను, ఆర్థిక, భూ బలాలు, కిరాయి బలగాలతో ఏ విధమైన అధికారం చెలాయించారో అదే ధోరణిలో నేటి నయా టీఆరెస్ దొరలు ప్రజాస్వామ్యాన్ని తమ అహంకారపు అదుపాజ్ఞలలోని యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేసి… తెలంగాణ బిడ్డలపై నడిపించే ప్రక్రియ జరుగుతున్నదనేది వాస్తవం. విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించి దుబ్బాక ఎన్నికలలో టీఆరెస్కు సరైన బుద్ధి చెబుతారని విశ్వసిస్తున్నాను.” అని విజయశాంతి మండిపడ్డారు. కాగా..అయితే… దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కును టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత వినియోగించుకున్నారు. అటు బొప్పాపూర్ పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు ఓటు వేసారు. తొగుటలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
next post