telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

హిందువులపై అంత గుడ్డి ద్వేషమెందుకు?

టీఆర్‌ఎస్‌ పార్టీపై విజయశాంతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “”ముస్లింలపై అంత గుడ్డి ద్వేషం ఎందుకు?” అని ఈ రోజు ఒక ప్రధాన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ గారు… ఇన్నేళ్ళూ టీఆరెస్ మిత్రపక్షంగా (ఇప్పుడు కాదని చెప్పుకుంటున్నారు) ఉంటూ వచ్చిన ఎంఐఎం పార్టీ ప్రముఖ నేత గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తులేనట్టు వ్యవహరిస్తున్నారు. ఆ ప్రముఖ నేత గతంలో తమవారిని 15 నిమిషాలు వదిలిపెడితే హిందువుల జనాభా నిష్పత్తిని వారి మతస్తుల జనాభాతో సమానం చేస్తాన్నాడు. తన వర్గం వారంతా కలసి ఉమ్మువేస్తే చాలు చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయం కూలిపోతుందని పరిహాసం చేశాడు. హిందువులు పవిత్రంగా ఆరాధించే గోమాతను ఉద్దేశించి చులకనగా మాట్లాడాడు. “హిందువులపై అంత గుడ్డి ద్వేషమెందుకు?” అని ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కేటీఆర్ గారు ఎందుకు నిలదీయలేదు? దీన్ని బట్టి చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆరెస్ మత రాజకీయాలకు తెగబడుతోందని స్పష్టమవుతోంది.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

Related posts