టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత విజయశాంతి ఫేస్ బుక్ లో విమర్శలు గుప్పించారు. తనవరకూ వస్తే కాని అసలు తత్వం బోధపడలేదు అన్న చందంగా కేటీఆర్ నిర్వేదం ఉందని విజయశాంతి విమర్శించారు. గత ఐదేళ్ల కాలంలో తమతో కలిసి ఉన్న వారే తెలంగాణ వాదులు… లేకపోతే తెలంగాణ ద్రోహులు అని టీఆర్ఎస్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్నిరోజులూ ప్రతిపక్షాలన్నీ అదే ఆవేదనతో కొట్టుమిట్టాడాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ అధిష్ఠానానికి అసలు తత్వం బోధపడినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. బోయే రోజుల్లోనైనా టిఆర్ఎస్ అగ్రనాయకత్వం తన వైఖరిని మార్చుకోవాలని ప్రతిపక్షాలు తో పాటు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. ఈ మేరకు విజయశాంతి తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు.
ఉద్యమ నాయకుడు సీఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని